Breaking News
Loading...
Friday, June 18, 2010

ఎవరు విలన్?




విలన్.. పేరే భయపెడుతుంది. కానీ.. ఇదే పేరుతో ఆల్‌టైం గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తీసిన సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి.. అందులోనూ అందాలరాశి ఐశ్వర్య కూడా నటిస్తుండడంతో.. అభిమానులు ఆతృతంగా సినిమాకోసం ఎదురుచూస్తున్నారు.. ఇంతకీ సినిమాలో విలన్ ఎవరు? ప్రధాన పాత్రలో కనిపించే విక్రమా.. పోలీస్ గెటప్‌లో ఉండే పృథ్వీరాజా?
దక్షిణాది క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం మరో ప్రయోగం చేశాడు. రామాయణం స్పూర్తిగా తీసుకొని విలన్ సినిమాను సిద్ధం చేశాడు. అది కూడా తమిళ్,తెలుగు, హిందీ మూడు భాషల్లో ఒకేసారి విడుదలవుతోంది. హిందీలో రావణ్‌గా.. తమిళ్‌లో రావణన్ గా.. తెలుగు విలన్‌గా పేర్లు మార్చుకొని థియేటర్లలోకి వస్తోంది.
విలన్ సినిమాలో అట్రాక్షన్ అంతా.. విక్రమ్, ఐశ్వర్యలే. సినిమా కథంతా ఈ రెండు క్యారెక్టర్ల చుట్టూనే తిరుగుతుంది. సినిమా టైటిల్ రోల్‌ ఎవరు పోషించారన్నది మణిరత్నం బయటపెట్టకపోయినా.. విక్రమ్ రోలే కావచ్చన్నది అందరి అంచనా. సినిమాలో వీరయ్య పాత్రను విక్రమ్ పోషించాడు. రాగిణి శర్మ పాత్రలో ఐశ్వర్య కనిపిస్తుంది. అడవిలో వీరిద్దరూ ఎందుకున్నారన్నదే సినిమా స్టోరీ..
ఇప్పటికే టీవీల్లో సందడి చేస్తున్న ట్రైలర్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. లొకేషన్లు.. ఐశ్వర్య, విక్రమ్‌ల గెటప్... వీరిద్దరి మధ్య సినిమాపై క్రేజ్‌ను పెంచుతున్నాయి. దట్టమైన అడవులు.. భీకరంగా కనిపిస్తున్న విక్రమ్ వేషధారణ.. సినిమాలన్నింటిలోకి ఇది కాస్త డిఫరెంట్ మూవీ అని చెప్పకనే చెబుతున్నాయి.


ఈ సినిమా కాస్త డిఫరెంట్..

విలన్ సినిమాను అన్ని సినిమాలతో పాటే ఒకే గాటన కట్టేయలేం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఓ కొత్త ప్రయోగంగా తెరకెక్కిందీ చిత్రం. తమిళ్,హిందీల్లో స్ట్రెయిట్ ఫిల్మ్‌గా షూటింగ్ జరుపుకొంది. కథ, కథాంశం.. షూటింగ్ లొకేషన్లు.. రెండు భాషల్లోనూ అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉంటాయి. కానీ.. ఆర్టిస్టులు మాత్రం రెండు భాషల్లోనూ మారిపోయారు. తమిళ్ నటించిన వారు.. హిందీలో కనిపించరు. ప్రాంతానికి తగ్గట్టుగా నటీనటులను ఎంపిక చేసుకున్నారు మణి. తమిళ్‌లో లీడ్ రోల్‌ను విక్రమ్ పోషిస్తే.. హిందీలో ఆ పాత్రలో మనకు కనిపించేది అభిషేక్ బచ్చన్.
ఇక తెలుగులో పోషించిన పాత్రకు పూర్తిగా యాంటీరోల్‌లో హిందీలో కనిపిస్తాడు విక్రమ్. ఒకే కథకు సంబంధించిన సినిమాలైనప్పటికీ.. రెండు వెరైటీ క్యారెక్టర్లు పోషించే అవకాశం విక్రమ్‌కు దక్కింది. అదికూడా మణిరత్నంలాంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో.. ఇలా రెండు విలక్షణ పాత్రలు చేయడం అరుదైన అవకాశమే. పైగా.. ఇలా ఒకే సినిమాలో వేరు వేరు భాషల్లో వేరు వేరు క్యారెక్టర్లు పోషించినవారు ఇప్పటివరకూ లేరనే చెప్పాలి.
తెలుగు, తమిళ్, హిందీల్లో ఒకే పాత్రలో కనిపిస్తుంది ఐశ్వర్య. అటు అభిషేక్‌తోనూ.. ఇటు విక్రమ్‌తోనూ ఒకే తరహాలో నటించి మంచిమార్కులు కొట్టేసింది. ముఖ్యంగా.. సీన్లకు తగ్గట్లుగా ధీరత్వం.. అమాయకత్వం.. బెదురుతనం.. ఇలా అన్ని ఫీలింగ్స్‌ను అత్యద్భుతంగా పలికించింది.
హిందీలో రావణ్‌గా.. తెలుగులో విలన్‌గా వస్తున్న ఈ సినిమా కోసం.. మణిరత్నం చాలా కష్టపడ్డారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు మూడేళ్లపాటు పనిచేశారు. సినిమా ఆకట్టుకునేలా ఉండడానికి చాలావరకూ షూటింగ్‌ను కర్నాటకలోని దట్టమైన అడవుల్లో తీశారు. నెలల తరబడి.. అడవుల్లోనే గడిపారు. మధ్యలో ఎన్నో అవాంతరాలు ఎదురైనప్పటికీ.. దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేశారు. తమిళ్‌లో విక్రమ్ పోషించిన పాత్రను హిందీలో అభిషేక్ పోషించాడు కాబట్టి.. ఈ రెండు క్యారెక్టర్లను కంపేర్ చేయడం సహజమే. మరి వీరిద్దరిలో పాత్రకు ఎవరు ఎక్కువగా న్యాయం చేశారన్నది తెరపై చూడాల్సిందే.

విలన్‌లో ఏముంది?

రామాయణానికి.. విలన్ సినిమాకు సంబంధం ఉందా?
సినిమా స్టోరీ రామాయణానికి సంబంధించిందేనా?
విలన్ సినిమాలో విలన్ ఎవరు?
విలన్ సినిమా కాస్త డిఫరెంట్‌గానే ఉండనుంది. సినిమా స్టోరీ గురించి తెలుసుకునేముందు క్యారెక్టర్ల గురించి తెలుసుకోవాలి. సినిమాలో ప్రధాన పాత్ర వీరయ్య. ఈ క్యారెక్టర్‌లో విక్రమ్ నటించారు. ఈయనకో చెల్లెలు ఉంటుంది. ఆమే ప్రియమణి. ఇక క్లాసికల్ డ్యాన్సర్‌ రాగిణిగా ఐశ్వర్య కనిపిస్తుంది. ఐశ్వర్య భర్త దేవ్ పాత్రలో తమిళ్ హీరో పృథ్వీరాజ్ నటించారు. సినిమా కథలో ఈ నాలుగు క్యారెక్టర్లే కీలకం.
రాగిణితో సినిమా మొదలవుతుంది. రాగిణి డ్యాన్స్ చూసిన పోలీస్ ఆఫీసర్ దేవ్.. ఆమెతో ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లిచేసుకుంటారు. లైఫ్ హ్యాపీగా సాగిపోతున్న తరుణంలో దట్టమైన అటవీ ప్రాంతంలోకి దేవ్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అయితే.. అక్కడికి వెళ్లిన తర్వాత.. ఓ వాస్తవం ఈ పోలీస్ ఆఫీసర్‌కు బోధపడుతుంది. గిరిజనులకు సంబంధించి చట్టం,న్యాయం పూర్తిగా వీరయ్య అనే వ్యక్తి చేతుల్లోనే ఉన్నట్లు తెలుసుకుంటాడు దేవ్. వీరయ్య చెప్పిందే అక్కడ వేదం. పోలీస్ చట్టం అమలు కావాలంటే.. వీరయ్య ఉండకూడదనుకుంటాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్యా శతృత్వం పెరుగుతుంది. ఓ సారి ఇద్దరూ గొడవపడతారు. అప్పుడు గాయపడ్డ వీరయ్య.. రాగిణిని కిడ్నాప్ చేసి అడవిలోకి పారిపోతాడు. అక్కడి నుంచి కథ రకరకాల మలుపులు తిరుగుతుంది. ముఖ్యంగా.. రాగిణి, వీరయ్యల మనస్తత్వాలపై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది.
తెరపై ఎక్కువగా వీరయ్య, రాగిణి పాత్రలే కనిపిస్తాయి. ముందు విలన్‌గా వీరయ్యను చూసిన రాగిణి.. చివరకు మనసు మార్చుకుంటుందా.. లేక వీరయ్య చివరి వరకూ విలన్‌గానే ఉంటాడా? సినిమా అంతా కూడా రాగిణి దృష్టి నుంచే కనిపిస్తుందని ఇప్పటికే ప్రకటించాడు డైరెక్టర్ మణిరత్నం. అందాలబొమ్మ ఐశ్వర్యకూ కెరీర్‌లో ఇది డిఫరెంట్ రోల్ అనే చెప్పాలి.
ఇక హిందీ, తమిళ్‌లో సినిమా పేరు రావణ్ కాబట్టి.. రామాయణానికి ఈ సినిమాకు ఎంతోకొంత లింకు ఉంటుందని భావించడం సహజమే. అయితే.. ఇక్కడ రాముడెవరు? రావణుడెవరు? విక్రమా? పృథ్వీరాజా? ... రావణుడు సీతను ఎత్తుకెళ్లాడు కాబట్టి వీరయ్య పాత్రనే రావణుడు అనుకోవాల్సి ఉంటుంది. అయితే.. రావణుడిలా విక్రమ్‌ది నెగిటివ్ రోల్ కాదనే చెప్పొచ్చు. మరొకరి భార్యను కిడ్నాప్ చేశాడు కాబట్టే.. ఈ టైటిల్‌ను క్రియేటివ్‌గా పెట్టి ఉండొచ్చు. అయితే.. పోలీస్ ఆఫీసర్ భార్యను కిడ్నాప్ చేయడం ద్వారా.. వీరయ్య సాధించాలనుకున్నది ఏమిటి? చివరకు.. వీరయ్య చనిపోతాడా లేదా అన్నదీ సస్పెన్సే.

స్పెషల్ ట్రీట్‌మెంట్..
తమిళంలో ఓ సినిమా తీసి హిందీ, తెలుగులోకో.. హిందీలో సినిమా షూట్ చేసి తెలుగు, తమిళ్‌లోకో డబ్ చేసి చేతులు దులుపుకోలేదు మణిరత్నం. రావణ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. హిందీకి ప్రత్యేకంగా.. తమిళ్‌కి ప్రత్యేకంగా ఆర్టిస్టులను ఎంచుకున్నారు. దీనికి ప్రధాన కారణం.. రెండు చోట్లా సినిమాకు క్రేజ్ తేవడంతో పాటు.. ఎక్కువ మొత్తంలో కలెక్షన్లు రాబట్టుకోవచ్చన్న వ్యూహం ఉంది. అందుకే ప్రధాన పాత్రలకు సంబంధించి ఆర్టిస్టుల మార్చారు. ఓ రకంగా చెప్పాలంటే.. ఒకేసారి రెండు సినిమాలను తీశారు మణిరత్నం.
మణిరత్నం చేసిన ఈ ప్రయోగం వల్ల.. తక్కువ ఖర్చుతో రెండు సినిమాలు పూర్తయ్యాయి. లొకేషన్లు.. షూటింగ్ ఖర్చులు చాలావరకూ కలిసొచ్చాయి. హిందీ, తమిళ్ వరకూ డబ్బింగ్ మూవీ అన్న ఫీల్ రాదు. పైగా.. ఇటు తమిళ్‌కు, అటు హిందీకి ఇటీవలి కాలంలో ఇంటర్నేషనల్ మార్కెట్ చాలా పెరిగంది. సినిమాలో ఒరిజినాలిటీ లేకపోతే.. కలెక్షన్లు రావడం చాలా కష్టం. ఈ విషయం గురు సినిమాతో మణిరత్నానికి అర్థమయ్యింది. తమిళంలోనూ, తెలగులోనూ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అందుకే.. రావణ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాడు. హిందీకి వేరుగా.. తమిళ్‌కు వేరుగా షూటింగ్ చేశారు. దీనివల్ల దేశమంతటా రావణ్‌కు స్పెషల్ క్రేజ్ వచ్చింది.
ఇక సినిమా నిర్మాణంలోనే రిలయన్స్ బిగ్ పిక్చర్స్‌తో టైఅప్ అయ్యి.. ఆర్థికభారాన్ని తగ్గించుకున్న మణిరత్నం.. రిలీజ్ విషయంలోనూ వ్యూహత్మకంగానే వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2200 థియేటర్లలో సినిమా విడుదలవుతోంది. ఇండియాలో హిందీ వెర్షన్ 1250 స్కీన్స్‌లో ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరగ్గా.. ఓవర్‌సీస్‌లో 325 స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నారు. ఇండియాలో తమిళ వెర్షన్‌ను 225 స్క్రీన్స్‌లోనూ, ఓవర్‌సీస్‌లో 150 స్క్రీన్స్‌లోనూ రిలీజ్ చేస్తున్నారు. తెలుగులోనూ.. 215 స్క్రీన్స్‌లో విలన్ విడుదలవుతోంది. అమెరికా, ఆస్ట్ర్లేలియా, న్యూజిలాండ్‌లో 25 స్క్రీన్స్‌లోనూ విలన్‌ను ప్రదర్శిస్తున్నారు. ఎంతలేదన్నా మూడువందల కోట్లను రావణ్ వసూలు చేయవచ్చని అంచనా. సినిమా స్టోరీ విషయంలోనూ.. షూటింగ్ విషయంలోనూ ఎంతో సీక్రెట్ మెయింటైన్ చేసిన మణిరత్నం.. సస్పెన్స్ అంతా తెరపైనే విప్పుతామంటున్నారు. మరి.. మణిమంత్రానికి కాసులు రాలతాయా..?

తెలుగంటే అలుసా..?

కోట్లాది రూపాయల బడ్జెట్.. విలక్షణమైన స్టోరీ.. ఎంతోమంది స్టార్లు.. అయినా.. సినిమాలో యాక్ట్ చేయించడానికి మణిరత్నానికి తెలుగువారు ఒక్కరూ కనిపించలేదు. కాసుల కోసం.. తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్ తరహాలో విలన్‌ను రిలీజ్ చేస్తున్న మద్రాస్ టాకీస్.. ఆర్టిస్టుల విషయంలో మాత్రం మనవారికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. తెలుగులో నటిస్తున్న ప్రియమణిని.. అడపాదడపా డబ్బింగ్ సినిమాలతో అలరిస్తున్న విక్రమ్‌నే.. తెలుగువారికి ప్రతినిధులన్న బిల్డప్ ఇస్తున్నారు మద్రాస్ టాకీస్ ఓనర్స్ మణిరత్నం, సుహాసిని..
తమిళ్ కోసం ప్రత్యేకంగా, హిందీ కోసం ప్రత్యేకంగా ఎంతో కేర్ తీసుకుని షూటింగ్ చేసిన మణిరత్నం తెలుగువారికి అవసరమైన ఎలిమెంట్లు మాత్రం ఒక్కటీ సినిమాలో పెట్టలేదు. తమిళంలో ఎడిట్ అయిన వెర్షన్‌కు భాష మార్చి తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగువారంటే.. తమిళులకు అంత అలుసా..?
మ్యూజిక్ మొఘల్ ఏ.ఆర్.రెహమాన్‌ ఈ సినిమాకు కంపోజ్ చేసినప్పటికీ.. తెలుగు నేటివిటీకి తగ్గ ఒక్కపాటా లేదు. పైగా.. చైన్నైలోనూ.. ముంబైలోను ఆడియో ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించిన మణిరత్నం.. తెలుగులోకి మాత్రం సైలెంట్‌గా ఆడియోను పంప్ చేశారు. అసలు విలన్ ఆడియో ఎప్పుడు రిలీజ్ అయ్యిందో కూడా ఎవరికీ తెలియదు. ఇక పాటలుకూడా.. అన్ని డబ్బింగ్ సినిమాల్లానే.. తమిళవాసనలు కొడుతున్నాయి.
సినిమా ప్రచారం చేయడానికి మాత్రం హైదరాబాద్‌కు వచ్చారు ఐశ్వర్య, విక్రమ్, మణిరత్నం, సుహాసిని. ప్రియమణి కూడా వారితో జతకలిసింది. ప్రెస్‌మీట్ అరేంజ్ చేసినా.. కంట్రోల్ అంతా సుహాసినీ చేతుల మీదుగానే సాగింది. ప్రశ్నలూ ఆమే అడిగింది.. జవాబులూ ఆమే చెప్పించింది. మొహమాటానికన్నట్లు చివర్లో ఎంతో కరుణించినట్లు ఓ రెండు ప్రశ్నలను అడగడానికి మీడియాకు ఛాన్స్ ఇచ్చింది. ఆమాత్రం దానికి.. హైదరాబాద్ దాకా రావాలా..? ప్రియమణికైతే అసలు మాట్లాడే ఛాన్సే ఇవ్వలేదు. సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పమంటూ ఆర్డరేసింది. మణిరత్నాన్ని గౌరవించి ప్రియమణి ఆన్సర్ చెప్పినా.. కూల్‌గా ఉండమంటూ సుహాసినికీ సలహా ఇచ్చిందంటే ఆమె ఎంత ఓవర్ చేసిందే అర్థం చేసుకోవచ్చు.

మొత్తంమీద చూస్తే.. విలన్ సినిమాలో విలన్ ఎవరో గానీ.. తెలుగువారి పాలిట విలన్ మాత్రం కచ్చితంగా మణిరత్నమే. గొప్ప డైరెక్టర్ అని మనం మురిసిపోవడమే తప్ప.. మంచి ప్రేక్షకులను మన తెలుగువారికి ఆయన విలువ ఇచ్చింది లేదు.



2 comments:

  1. mana herolu (mega,power,tiger,rebel tokka, toshanam) tama egolanu pakkana petti natinchadaaniki oppukuntaara asalu? toda kottali, iddaru leka mugguru heroines undaali,
    punch dialogues undaali, vandamandinaina okka chetto mattu pettali ivanni vunte kaani oppuokoraaye

    ReplyDelete
  2. whats your problem. Its his movie.. He is concentrating on tamil and Hindi. Its his way. madhayalo telugu vaaru ante alusu pulusu em ledu. Movie thing is business. He acts according to that. just dont copy channels and dont think in the same way.

    ReplyDelete

Copyright © 2013 AataPaatalu All Right Reserved